Computers and Technology is the most important and the needful thing in our common life. This blog Computer and Technology titled has created for those who are curious to learn about new things about latest technology and latest computers, its technology, phones, future innovations etc. So we can understand Technology properly to implement those thing on our finger tips to make technology come true in our practical life.

Saturday, 26 November 2016

జనానికి మరో ఊరట

కొత్త నోట్ల కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో వెసలుబాటు కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ). ఇప్పటి వరకు బిగ్ బజార్లలో డెబిట్ కార్డ్ పై రూ.2వేలు వరకు తీసుకునే వెసలుబాటు ఇచ్చింది. ఇప్పుడు ఐనాక్స్ ధియేటర్లలోనూ ఇలాంటి అవకాశాన్ని కల్పించింది. ఒకటో తేదీ వస్తుండటం.. సిటీలో పూర్తి స్థాయిలో ATMలు పని చేయక ఇబ్బంది పడుతున్న జనానికి మరో ఊరట ఇది. ఐనాక్స్ ధియేటర్లలో డెబిట్ కార్డ్ ద్వారా రూ.2వేలు తీసుకోవచ్చు. ఏ బ్యాంక్ కార్డ్ అయినా పర్వాలేదని.. అన్ని...

Saturday, 15 October 2016

చిరంజీవి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి పారితోషికం విషయంలోనూ టాపే. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం, మళ్లీ సినిమా పరిశ్రమ తలుపు తట్టడం జరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన తన 150వ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు నాగార్జున నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించనున్నారు.   ఈ ప్రోగ్రామ్‌ కోసం చిరంజీవికి భారీగా రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేశారట నిర్వాహకులు. ఒక్కో ఎపిసోడ్‌కు పదిలక్షల రూపాయలు చిరంజీవి తీసుకోనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అలా ఎన్ని ఎపిసోడ్‌లు ప్రసారమైతే అన్ని...

మరో సంచలనానికి సిద్దమైన గూగుల్, ఫేస్‌బుక్

యావత్ ప్రపంచాన్ని ఇంటర్నెట్టుతో అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు మరో బృహత్తరకార్యానికి సన్నాహాలు చేస్తున్నాయి. సెకనుకు 15వేల జీబీల సమాచారాన్ని బదిలీ చేయగల అత్యంత శక్తిమంతమైన కేబుల్ తో ఆసియాను, అమెరికాలను సముద్ర అంతర్భాగం ద్వారా అనుసంధానించనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిలస్ నగరం నుండి ప్రారంభమయ్యే ఈ కేబుల్ హాంకాంగ్ ను అనుసంధానిస్తుంది. సాంకేతిక భాషలో చెప్పాలంటే 120 టెరాబైట్స్ పర్ సెకండ్ వేగంతో ఈ కేబుల్ డేటాను బదిలీ చేస్తుంది. రెండు ఖండాలకు అటో దిక్కున ఇటో దిక్కున గల హాంకాంగుకు, లాస్ ఏంజిలస్ నగరాలకు మధ్య...

సొంత రాష్ట్రాన్ని కించపరుస్తావా!

తనకు బహుమతిగా దక్కిన బీఎండబ్ల్యూ కారును.. జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ వెనక్కి ఇచ్చేస్తానని చేసిన ప్రకటనపై త్రిపుర ప్రభుత్వం గుర్రుగా ఉంది. త్రిపుర రహదారులు ఈ కారు తిరిగేందుకు అనువుగా లేవని, తగిన సర్వీస్‌ సెంటర్లు కూడా లేనందున.. బీఎండబ్ల్యూను వెనక్కి తీసుకొని.. దానికి తగిన నగదు కోరడాన్ని తప్పుబట్టింది. త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని సహా విదేశీ ప్రముఖుల కార్లు ఎటువంటి ఇబ్బంది లేకుండానే తిరిగాయని ప్రజా పనుల శాఖ మంత్రి బాదల్‌ పేర్కొన్నారు. స్వరాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడిన దీపకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రవాణా మంత్రి మాణిక్‌దేవ్‌ అన్నార...

మాటలు చెప్పదు.. చేతలే! - భారత సైన్యానికి మోదీ ప్రశంస

సర్జికల్‌ దాడులకు ఆధారాలు చూపాలన్న ప్రతిపక్ష నేతలపై ప్రధాని మోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. భారత సైన్యం వాక్‌శూరత్వం చూపదని, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తుందని స్పష్టంచేశారు. శుక్రవారం భోపాల్లో ‘శౌర్య స్మారక్‌’ను ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాజీ సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దులు, దేశాలకు అతీతంగా మానవ జాతిని భారత సైన్యం రక్షిస్తోందని కితాబిచ్చారు. ‘మన జవాన్ల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వారి యూనిఫారం, వారి ధైర్యసాహసాల గురించే ప్రస్తావిస్తుంటాం. కానీ అంతకుమించిన మూర్తీభవించిన మానవత్వం వారిలో ఉంది. వారు మాటలు చెప్పరు.. వీరత్వాన్ని...

ఎయిర్ సెల్ : రూ.24లకే 1జీబీ 3జీ డేటా

వినియోగదారులకు కొత్త ఆఫర్ ఇచ్చింది ఎయిర్ సెల్. రూ.24 లకే 1 జీబీ 3జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. 28 రోజుల పాటు దీని వ్యాలిడిటీ ఉంటుంది. అయితే దీనకంటే ముందు  రూ. 329లకు 2జీబీ 3జీ డేటాను రీచార్జ్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులు ఉంటుంది. ఈ ఆఫర్ రీ చార్జ్ చేసుకుంటే.. ఆ తర్వాత చేసుకునే ప్రతి రూ. 24 ల రీ చార్జ్ కు 1జీబీ 3జీ డేటా లభిస్తుంది.  ఈ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కర్ణాటక, అసోం, ఒడిషా, బీహార్, జార్ఖండ్, పంజాబ్, జమ్ము కాశ్మీర్ లలో ఉంటుంద...

చెలరేగిపోతున్న చైనా గూడ్స్‌

ఎన్‌ఎ్‌సజిలో భారత సభ్యత్వానికి మో కాలడ్డడం, తీవ్రవాది మసూద్‌ అజార్‌పై ఐరాస విధించదలచిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నందున దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు ఒకపక్క వెల్లువెత్తుతున్నా.. మరోవైపు భారతలో చైనా వస్తువుల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయని చైనా మీడియా కోడై కూస్తోంది. భారతలో అతిపెద్ద పండుగ సీజన్‌ అయిన దివాళీ సీజన్‌లో షాపింగ్‌ జోరుగా సాగుతుందని, ఈ సీజన్‌లో చైనా గూడ్స్‌ను బహిష్కరించాలని సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోందని చైనాకు చెందిన అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. కొందరు భారత రాజకీయ నాయకులు కూడా ఇందుకు...

కొత్త జిల్లాలతో రెవెన్యూ ఖజానా కళకళ

రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరుగుతోంది. కొత్త జిల్లాల ఆలోచన కూడా  రెవెన్యూ ఖజానాకు కళ తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా… జిల్లాల్లో … రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడమే గాకుండా రికార్డు స్థాయిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. గత ఆరునెలల కాలంలోరాష్ట్రంలో భూములు, భవనాల అమ్మకాల్లో 31.21 శాతం పెరుగుదల కనిపించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య  ఆరు నెలల కాలంలో… 19వందల35 కోట్లు ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఖజానాకు చేరాయి. గత ఏడాది.. ఇదే కాలంలో.. సర్కారుకు స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ ద్వారా 14వందల75 కోట్లు...

రూ.35,000 కోట్లు ముంచిన నోట్‌7

గెలాక్సీ నోట్‌ 7 స్మార్ట్‌ఫోన్లను వెనక్కి రప్పించడం, విక్రయాల నిలిపివేత వల్ల శామ్‌సంగ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుత త్రైమాసికంలో మొబైల్‌ వ్యాపారం ద్వారా వచ్చే లాభమంతా కోల్పోయే అవకాశం ఉంది. నోట్‌ 7 విక్రయాల నిలిపివేత ప్రభావంతో ప్రస్తుత, రాబోయే త్రైమాసికాల్లో 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.20000 కోట్లు) భారం పడనుందని శామ్‌సంగ్‌ వెల్లడించింది. దీంతో ఈ ఫోన్లను వెనక్కి రప్పించడం వల్ల మొత్తంగా పడే భారం 530 కోట్ల డాలర్లని (రూ.35000 కోట్లు) తెలిపింది. బ్యాటరీ వేడెక్కడం, పేలిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో గెలాక్సీ నోట్‌ 7 విక్రయాలను శామ్‌సంగ్‌...

కశ్మీర్‌లో చైనా జెండాల ప్రదర్శన !

కశ్మీర్ లో వేర్పాటు వాదుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇప్పటి వరకు పాక్ జెండాలు మాత్రమే ఎగురవేసిన అల్లరిమూకలు తొలిసారిగా పాక్ జెండాలతో పాటు చైనా జెండాలు ప్రదర్శించారు. బారాముల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా తమ పోరాటంలో చైనా సాయం కావాలంటూ పిచ్చిరాతలు రాశారు. ర్యాలీ సందర్భంగా జెండాలు పట్టుకున్న వారు తమ ముఖాలు కనిపించకుండా ముఖాలకు మాస్కులు ధరించారు. అలాగే విధుల్లో ఉన్న పోలీసులపై కూడా ఈ అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. పరిస్థితిని అదపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గోవాలో బ్రిక్స్...